Israel-Hamas War | ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడి (Israel-Hamas War) ఆపాలంటూ.. ఈ ఘర్షణ వేళ మానవతా దృక్పథంతో వెంటనే ఇరువర్గాల మధ్య సంధికి పిలుపునివ్వాలని ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే గాజా స్ట్రిప్లో ఎటువంటి అవరోధం లేకుండా మానవతా సాయం అందాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్కు భారత్ (India) దూరంగా ఉంది. దీనికి అనుకూలంగా 120 దేశాలు ఓటువేయగా.. వ్యతిరేకంగా దేశాలు 14 ఓటువేశాయి. ఇక ఈ ఓటింగ్లో 45 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ 45 దేశాల్లో ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్తో పాటు భారత్ కూడా ఉంది. ఇక జోర్డాన్ (Jordan) ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు.
120 in favor
14 against
45 abstentions
Countries adopt resolution calling for immediate & sustained humanitarian truce in the Middle East during an Emergency Special Session of #UNGA. https://t.co/XjKyOXQqu8 pic.twitter.com/nDh3Qj3MtV
— United Nations (@UN) October 27, 2023
మరోవైపు ఇజ్రాయెల్ , పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా సంభవించిన భారీ ప్రాణనష్టంపై ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో, రెండు దేశాల నుండి హింసను తక్షణమే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి మరియు పౌర మరణాల పట్ల భారతదేశం ఆందోళన చెందుతోందని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ సమావేశంలో అన్నారు. యుద్ధం ఈ ప్రాంతంలో శత్రుత్వాలను సృష్టించింది, ఇది మానవతా సంక్షోభానికి దారితీసింది. ఈ విషయంలో అన్ని దేశాలు తమ బాధ్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు.