తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు పూజాహెగ్డే (Pooja Hegde). ఈ భామ సినిమాలో నటిస్తుందంటే అది హిట్టయినట్టే. హీరోల పాలిట గోల్డెన్ లెగ్గా మారిపోయింది పూజాహెగ్డే. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ (Most Eligible Bachelor) చిత్రంతో అఖిల్కు తొలి సక్సెస్ అందించింది. ఈ భామను అందరూ తెలుగమ్మాయి (Telugu girl) అని అంటున్నారట.
ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే మాట్లాడుతూ..ముంబై (Mumbai)లో నన్ను ప్రతీ ఒక్కరు తెలుగమ్మాయి అని పిలుస్తున్నారు. తెలుగమ్మాయి అని పిలవబడటం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు అంత గౌరవాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. పూజాహెగ్డే, ప్రభాస్ తో చేస్తున్న రాధేశ్యామ్ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..ఫిబ్రవరిలో విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో బీస్ట్ సినిమా చేస్తోంది పూజాహెగ్డే.
ఇది కూడా చూడండి
నా కొడుకు జైలు నుంచి ఇంటికొచ్చే వరకూ నో ఖీర్, నో స్వీట్స్: గౌరీ ఖాన్
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్బాబుకు చిరంజీవి పిలుపు