ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న తన తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్పై ఇంటికొచ్చే వరకూ మన్నత్లో ఖీర్గానీ, ఇతర స్వీట్లుగానీ చేయకూడదని తన ఇంట్లోని సిబ్బందికి ఆదేశాలిచ్చింది అతని తల్లి గౌరీ ఖాన్. ఈ నెల 3న ఆర్యన్ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. బుధవారం అతని బెయిల్పై ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆర్యన్ జైలుకెళ్లినప్పటి నుంచీ షారుక్తోపాటు అతని భార్య గౌరీ దుఃఖంలో మునిగిపోయారు.
కొడుకు జైల్లో ఉండటంతో ఈ పండుగల సీజన్లో వాళ్లు సంబురాలకు దూరంగా ఉన్నారు. ఈద్, దీపావళిలాంటి పండుగల వేళ మన్నత్ ఎంతో సుందరంగా ముస్తాబవుతుంది. అలాంటిది ఈసారి మాత్రం అలాంటివేమీ కనిపించడం లేదు. ఈ మధ్యే ఇంట్లోని సిబ్బంది ఎవరో లంచ్ మెనులో భాగంగా ఖీర్ చేస్తుంటే.. గౌరీ ఖాన్ వాళ్లను వారించి, ఆర్యన్ వచ్చే వరకూ ఎలాంటి స్వీట్లు చేయొద్దని చెప్పినట్లు షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.