నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లవ్స్టోరి (Love Story) చిత్రం సూపర్ క్రేజ్తో, అనూహ్యమైన వసూళ్లతో విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్వేవ్ తరువాత థియేటర్స్కు మళ్లీ ఊపు తీసుకొచ్చిన సినిమాగా లవ్స్టోరీని అభివర్ణిస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే సినిమాకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
ఏషియన్ సునీల్ నారంగ్, రామ్మోహనరావుతో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై శేఖర్ ఈ సినిమా నిర్మించారు. మొదట్నుంచీ ఈ సినిమా విషయంలో నిర్మాణ బాధ్యతలు కూడా శేఖర్కమ్ముల చూసుకున్నాడు. సినిమా తొలికాపీ పూర్తిచేసి నిర్మాతలరే అప్పజెప్పాడు. శేఖర్కమ్ముల బ్రాండ్ వాల్యూ, నాగచైతన్య మార్కెట్, సాయిపల్లవి మ్యాజిక్తో సినిమాను అనూహ్యమైన రేట్లకు అమ్ముకున్నారు నిర్మాతలు.
థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని కలిపి దాదాపు 50 కోట్లకు పైనే బిజినెస్ చేశారని సమాచారం. ఇందులో శేఖర్ కమ్ములకు 15 కోట్లకు పైనే పారితోషికంగా అందించారట. ఇది ఆయన కెరీర్లోనే ఇప్పటి వరకు అందుకున్న అత్యధిక పారితోషికం.
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!