తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కామెడీ షో జబర్దస్త్. అయితే కేవలం కామెడీతో మాత్రమే కాకుండా కాంట్రవర్సీతో కూడా అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఇక ఇప్పుడు కరోనాతో వార్తల్లోకి వచ్చింది ఈ షో. ఇదివరకే ఇందులో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ విషయం బయటకు రాకుండా చూసుకున్నారు. అప్పట్లో సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. షూటింగుకు అనుమతులు వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని జబర్దస్త్ షూట్ చేస్తున్నారు. అయినా కూడా ఈ వైరస్ వాళ్లను వదిలిపెట్టడం లేదు.
తాజాగా వర్ష కరోనా బారిన పడింది. కేవలం ఆమెకు మాత్రమే పాజిటివ్ వచ్చిందా.. ఇంకా కొంతమందికి కూడా అలాగే వచ్చిందా అనేది అర్థం కావడం లేదు. కేవలం వర్ష విషయం మాత్రమే బయటికి వచ్చింది. అయితే ఈమెకు రావడంతో పాటు మరి కొందరు కమెడియన్లు కూడా కోవిడ్ బారిన పడ్డట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వర్షతో పాటు ఉండే మరో కమెడియన్ ఇమాన్యుయేల్ కూడా వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లు మాత్రమే కాదు అతని టీం లీడర్ కెవ్వు కార్తిక్ కూడా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో చాలామంది కమెడియన్లు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడ ఒక్కరికి వచ్చినా కూడా అందరికీ ఆ భయం అనేది పోదు.
ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కేవలం వర్ష వరకు కరోనా వచ్చి వెళ్ళదు కదా.. ఆమెతో పాటు ఉన్న వాళ్లు కూడా కచ్చితంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందే. అందరూ కలిసి షూటింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరినీ ఆ భయం వెంటాడుతుంది. ఎప్పుడూ 4 ఎపిసోడ్లు అడ్వాన్స్ షూటింగ్ చేస్తారు కాబట్టి ఇప్పట్లో ఈ కామెడీ షోకి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేస్తే మాత్రం కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని తిప్పలు తప్పకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి..
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ