ramesh valiyasala | సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా కంగారు పడుతున్నారు. అంతలా ఇక్కడ వరస విషాదాలు జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంతోనే కంగారు పడుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంతలోనే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీరియల్ నటుడు రమేశ్ వలీయశాల ఆత్మహత్య చేసుకున్నారు. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం ( సెప్టెంబర్ 11 ) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయన మరణంతో కేరళ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లిపోయింది. ఆయన వయసు 54 సంవత్సరాలు.
గత కొద్దిరోజులుగా కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రమంతటా లాక్డౌన్ వాతావరణం నడుస్తోంది. షూటింగ్స్ కూడా స్వచ్ఛందంగా నిలిపివేశారు దర్శక నిర్మాతలు. దీంతో కొద్దిరోజులుగా ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా రెండవ భార్య, కుమారుడుతో కలిసి వాలియశాలలోని తన నివాసంలో ఉంటున్నాడు రమేశ్. కేరళలో రమేశ్కు మంచి గుర్తింపు ఉంది. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ ఈయన నటించాడు. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ డాక్టర్ జానరధనన్ అతని గురువు. 1999 నుంచి సీరియల్స్లో నటిస్తున్నాడు రమేశ్ వలియశాల. రమేశ్ మరణవార్త తెలిసి కేరళ చిత్ర ప్రముఖులు, ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న హాట్ యాంకర్
Prabahs: సైలెంట్గా యూకే వెళ్లిన ప్రభాస్ .. ఎందుకో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?