ప్రముఖ కొరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్ ఇక లేరు. ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన కరోనాతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శివశంకర్ మాస్టర్కు టాలీవుడ్తో పాటు.. ఇతర సినిమా ఇండస్ట్రీలతో చాలా అనుబంధం ఉంది. తెలుగు, తమిళ భాషలతో పాటు 10 భాషల్లో సినిమాలకు ఆయన కొరియోగ్రఫర్గా సేవలందించారు.
దాదాపు 800 సినిమాలకు పైగా ఆయన కొరియోగ్రఫర్గా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన చాలా సినిమాల్లో నటించారు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగానూ వ్యవహరించారు.
శివశంకర్ మాస్టర్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ల పేర్లు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్. ఇద్దరు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. తండ్రి వృత్తినే వాళ్లు కూడా ఎంచుకున్నారు. ఇద్దరూ కొరియోగ్రఫర్లుగానే స్థిరపడ్డారు. పలు భాషల్లో సినిమాలకు డ్యాన్సు మాస్టర్లుగా వాళ్లు పనిచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టాలీవుడ్లో మరో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?