‘లైగర్’ సినిమా వల్ల నష్టాల పాలయ్యామని, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ హైదరాబాద్ ఫిలించాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సినిమాను విడుదల చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయామని వారన్నారు.
గతంలో పూరి జగన్నాథ్ ఇంటి ముందు నిరసన చేపట్టగా…తాను ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తానని మాటిచ్చారని, ఇప్పటిదాకా చెల్లించలేదని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల మేర తమకు ఆర్థిక నష్టం జరిగిందని వారంటున్నారు. పూరి జగన్నాథ్ తమ సమస్యపై స్పందించాలని ఎగ్జిబిటర్స్ కోరారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అపజయం పాలైంది.