సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 8: మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న సిరిసిల్ల, స్వచ్ఛ పట్టణ దిశగా మరో అడుగుముందుకేసింది. రోడ్ల సుందరీకరణ, పార్కులు, వైకుంఠధామాలు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించుకొని సర్వాంగ సుందరంగా తయారైంది. తాజాగా బహిరంగ మల విసర్జనకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు చోట్ల స్వచ్ఛ టాయిలెట్లను ఏర్పాటు చేసిన మున్సిపల్ యంత్రాగం. తాజాగా మహిళల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి నిధులు 18 లక్షలు వెచ్చింది ఆధునిక హంగులతో షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ పరిధిలో జరిగే జాతర, ఇతర ఉత్సవాల సమయాల్లో దీనిని వినియోగించనున్నది.
ఈ బస్సులో అనేక ప్రత్యేక సౌకర్యాలున్నాయి. బేబీ ఫీడింగ్ కోసం ఓ గదిని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు మరో గదిని కేటాయించారు. దివ్యాంగ మహిళల కోసం తాత్కాలిక ర్యాంపు సౌకర్యం కల్పిస్తారు. షీ టాయిలెట్ నిర్వహణను మహిళా పొదుపు సంఘం సభ్యులకు కేటాయించేందుకు పరిశీలిస్తున్నారు. టాయిలెట్ నిర్వహణతోపాటు అందులోనే చిన్నపాటి వ్యాపారం చేసుకునేందుకు వీలుగా మార్ట్ను ఏర్పాటుచేశారు. మహిళల మెటీరియల్స్, టీ, స్నాక్స్ అమ్మేందుకు వీలు కల్పించారు. నాప్కిన్స్, సబ్బులు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భారీ సిక్సులు కొడుతున్న షారుక్ఖాన్..ఇది ట్రైలరే!
నెలాఖరులోగా బంజారా, ఆదివాస్ భవన్లు సిద్ధం చేయాలి