ప్రముఖ సినీ నటుడు ఆర్ శరత్కుమార్ (R Sarathkumar) అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శరత్కుమార్ చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని ఆయన పీఆర్ టీం అప్డేట్ అందించింది. శరత్కుమార్ వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యం (Health)తో చెన్నైలోని నివాసానికి చేరుకున్నారని, అభిమానులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం విజ్ఞప్తి చేసింది.
డీ హైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైన శరత్కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లినట్టు వార్తలు హల్ చల్ చేస్తుండటంతో.. అభిమానులు ఆందోళన చెందకుండా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది పీఆర్ టీం. ఇక తమ అభిమాన నటుడు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.
తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆర్ శరత్కుమార్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విజయ్ నటిస్తున్న వారసుడు చిత్రంలో కీలక పాత్రలో నట్తిస్తున్నాడు. దీంతోపాటు నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీలో కీ రోల్ చేస్తున్నాడు. ఆల్ ఇండియా సమతువా మక్కళ్ కచ్చి పార్టీని స్థాపించి.. రాజకీయాల్లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు శరత్కుమార్.
Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also :RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!