ప్రస్తుతం మహేశ్ బాబు (Tollywood) తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తిసురేశ్ ఇపుడెక్కడుందో తెలుసా..? ఈ భామ ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతోంది. అయితే చిత్రీకరణ కోసం ముంబై (Mumbai )కి వెళ్లిందనుకునేరు. తన స్నేహితులతో కలిసి సరదా సమయాన్ని ఎంజాయ్ చేసేందుకు ముంబైకి వెళ్లింది కీర్తిసురేశ్. బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్డ్ తెలుపు రంగు చొక్కాలో ఉన్న కీర్తిసురేశ్ చిరునవ్వులు చిందిస్తూ పూల మొక్క ముందు నిలబడి దిగిన స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.
కర్లీ హెయిర్ తో పెద్ద చెవి రింగులతో ముఖంపై 1000 వాట్ల చిరునవ్వు ఉద్భవించిందా అన్నట్టుగా కీర్తిసురేశ్ తాజా ఫొటోలో మెరిసిపోతుంది. ఖచ్చితమైన మిడ్ వీక్ (వారం మధ్యలో) మూడ్ అంటూ స్టిల్ కు క్యాప్షన్ ఇచ్చింది కీర్తిసురేశ్. వీకెండ్ కోసం ఎదురుచూస్తూ..అంటూ #WednesdayVibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్ లను జతచేసింది. కీర్తిసురేశ్ ఖాతాలో గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట, మలయాళ సినిమా వాశి చిత్రాలున్నాయి.
2022 వరకు చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉండనుంది కీర్తిసురేశ్. రజినీకాంత్ తో అన్నాత్తే సినిమాలో నటిస్తోంది. మరోవైపు సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తోన్న ‘సాని కాయిధమ్ ’ లో కీలక పాత్ర పోషిస్తోంది.
Sri Reddy | సంసారంలో సరిగమలు సహజం..సమంతకు శ్రీరెడ్డి సూచన..వీడియో వైరల్
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్