Ram charan | మన దగ్గర హీరోలకు సినిమాలపై ఇష్టం మాత్రమే కాదు.. దేవుడిపై భక్తి కూడా ఎక్కువగానే ఉంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల్లో కొంతమంది ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటారు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ హీరో.. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడు. సినిమాలతో పాటు భక్తిభావం కూడా చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు రామ్ చరణ్. ఏడాదిలో ఒకటి కాదు రెండు సార్లు మాల ధారణ చేస్తాడు మెగా వారసుడు. ఈ విషయంపై తాజాగా ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.
ఏడాదిలో రెండు సార్లు అయ్యప్ప మాల వేసుకుంటానని.. మాలలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు చరణ్. సాధారణంగా తన పుట్టిన రోజుతో పాటు ఈ ఏడాది చివర్లో అయ్యప్ప మాల వేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా మారిపోయింది అంటున్నాడు మెగా పవర్ స్టార్. అయితే ఈసారి ట్రిపుల్ ఆర్ విడుదల సందర్భంగా మాల ముందుగా వేసుకోలేకపోయానని.. అందుకే విడుదల తర్వాత వేసుకున్నాను అని చెప్పాడు మెగా వారసుడు. అలాగే ఈ ఏడాది చివర్లో దసరా తర్వాత కూడా అయ్యప్ప మాల వేసుకుంటాను అని చెప్పాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా మాలధారణ విషయంలో మాత్రం చరణ్ కొన్నేళ్లుగా అదే నియమాలు పాటిస్తూ వస్తున్నాడు.
ఈయనను చూసి మిగిలిన హీరోలు కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు అడుగులు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం మొదటిసారి ఆంజనేయ మాల వేశారు. రామ్చరణ్ను చూసిన తర్వాతే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై చరణ్ వివరణ ఇస్తూ.. అలాంటిదేం లేదు.. చాలా సంవత్సరాలుగా ఎన్టీఆర్ కూడా వేయాలి అనుకుంటున్నారు.. ఇప్పటికి కుదిరింది అని చెప్పాడు. ఏదేమైనా స్టార్ హీరోలు ఇలా భక్తిభావం వైపు అడుగులు వేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
“ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..”
“Acharya | ఇండియాలోని అతిపెద్ద సెట్లలో ధర్మస్థలి సెట్ ఒకటి :కొరటాల శివ”
KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ చిత్ర బృందాన్ని అభినందించిన రామ్ చరణ్!”