మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిక
జమ్మికుంట, జూలై 5: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ గాజుల భాస్కర్ (27వ వార్డు) టీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఆయన మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. జమ్మికుంట అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు నిధులైనా వెచ్చించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు.