స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni), సాక్షి సింగ్ కపుల్ కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రొడక్షన్ హౌస్లో రాబోతున్న తొలి సినిమాకు రమేశ్ తమిళ్మని దర్శకత్వం వహించబోతున్నట్టు అప్డేట్ కూడా వచ్చింది.
కాగా తాజాగా ధోనీ మైదాన్ ప్రొడక్షన్లో వస్తున్న మొదటి ప్రాజెక్ట్లో లీడ్ యాక్టర్లకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం హరీశ్ కల్యాణ్, ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం.
ప్రముఖ నటీటనులు ఈ చిత్రంలో భాగం కానుండగా.. వారి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఇతర భారతీయ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని డైరెక్టర్ రమేశ్ తమిళ్మని హింట్ ఇచ్చేశాడు.
కోలీవుడ్ నటుడైన హరీశ్ కల్యాణ్ తెలుగులో జెర్సీ సినిమాలో మెరిశాడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంకా ఆరుళ్ మోహన్. ఈ ఇద్దరు ధోనీ ప్రొడక్షన్ వెంచర్లో చేస్తున్న సినిమాపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్లాల్.. జల్లికట్టు డైరెక్టర్తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా