బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే (Deepika Padukone) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే (Project K) తో బిజీగా ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కాగా దీపికా పదుకునేకు హఠాత్తుగా హార్ట్ బీట్ పెరగడంతో..ఆమె వెంటనే హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి వెళ్లిందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చినట్టు ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
దీపికా పదుకొనే 3 రోజుల క్రితం రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆస్ప్రతికి వెళ్లిందట. అంతేకాదు ఆమె ఆరోగ్యంగా ఉందని, ప్రస్తుతం ప్రాజెక్టు కే షూటింగ్లో పాల్గొంటుందని లేటెస్ట్ అప్డేట్ కథనం. దీపికా పదుకొనే ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన స్పెషల్ సెట్స్లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటున్నట్టు తాజా సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్..కాగా డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
దీపికా పదుకొనే మరోవైపు సర్కస్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. షారుక్ ఖాన్తో పఠాన్ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో జాన్అబ్రహాం కీ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు ఫైటర్ చిత్రంలో కూడా నటిస్తోంది.