బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ షారుక్ ఖాన్ (Shahrukh khan) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ (Atlee) తో సినిమా చేయనున్నాడని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని న్యూస్ వచ్చినా…దీనిపై ఆట్లీ, షారుక్ టీం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రంలో నయనతార (Nayanatara) ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్ కు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది.
దంగల్ ఫేం సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ను కీ రోల్ కోసం ఎంపిక చేసినట్టు ముంబై సర్కిల్ లో న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి ఆట్లీ దంగల్ భామను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడని చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి సంకి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. మరోవైపు షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో నటిస్తున్న పఠాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
ముంబైలోని యశ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో పఠాన్ షూటింగ్ కొనసాగుతుండగా..త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు షారుక్. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆట్లీ-షారుక్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!