దోపిడీ కేసు (రూ.200 కోట్లు)కు సంబంధించి సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ అంశంలో ఏదో ఒక అప్ డేట్ బయటకు వస్తూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది. ఇప్పటికే సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)కు విలువైన కానుకలు అందించాడని వార్తలు వచ్చాయి.
కాగా మరో నలుగురి నటీమణులకూ సుఖేశ్ ఖరీదైన కానుకలు ఇచ్చాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. తాజా అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ ఫేం నిక్కి తంబోలి, ‘బడే అచ్ఛే లాగ్తే హై’ ఫేం చాహత్ ఖన్నా (Chahat Khanna) , సోఫియా సింగ్ (Sophia Singh), అరుషా పాటిల్ లు సుఖేశ్ చంద్రశేఖర్ను జైలు ప్రాంగణంలో కలుసుకున్నారట. ఇక సుఖేశ్ తాను దక్షిణాది చిత్ర పరిశ్రమ నిర్మాతల్లో ఒకరినని పరిచయం చేసుకున్నాడని కథనాల సారాంశం.
కేసులో అరెస్ట్ చంద్రశేఖర్ సహాయకురాలు పింకీ ఇరానీ ఈ నలుగురు హీరోయిన్లను అతనితో కలిపించిందని బీటౌన్ సర్కిల్లో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నలుగురికి గుక్కీ, వెర్సేస్, లూయిస్ విట్టన్ లాంటి బ్రాండెడ్ వస్తువులు బహుమతిగా ఇచ్చాడని టాక్ నడుస్తోంది.
నగదు, ఖరీదైన కానుకలు..
చాహత్ ఖన్నాకు రూ.2 లక్షల నగదు, బ్లూ కలర్ వెర్సేస్ వాచ్ను ఇచ్చాడట. ఆరుషా పాటిల్కు సుఖేశ్ రూ.5.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయగా..నిక్కీ తంబోలీని పరిచయం చేసేందుకు సుఖేశ్ నుంచి పింకీ ఇరానీ రూ.10 లక్షలు తీసుకుందట. ఇక నిక్కీ తంబోలీకి పింకీ ఇరానీ రూ.1.5 లక్షలు ఇవ్వగా..మొదటి సారి కలిసినపుడు సుఖేశ్ కూడా ఆమెకు రూ.2 లక్షలతోపాటు గుక్కీ బ్యాగ్ను అందించాడట సుఖేశ్. సోఫియా సింగ్కు రూ.2 లక్షల నగదు, ఎల్వీ బ్యాగ్ను అందించడమే కాకుండా అదనంగా మరో రూ.1.50 లక్షలు కూడా అందించినట్టు ఇన్సైడ్ టాక్.
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్గన్పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్లో అంతా షాక్..!
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?