టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య (Acharya). ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
అయితే పాన్ ఇండియా రిలీజ్ విషయంలో చిరు సంతోషంగా లేడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆచార్య కథ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉండటం..ఇతర ప్రాంతాల్లో ఈ స్టోరీకి అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని భావిస్తున్నాడట చిరు. అయితే మరోవైపు రాంచరణ్ మాత్రం పాన్ ఇండియా రిలీజ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తన్నాడట. మరి ఆచార్య తెలుగుకే పరిమితమవుతాడా..? లేదంటే పాన్ ఇండియా ప్రేక్షకులను పలుకరిస్తాడా..? అనేది చూడాలి.
సామాజిక ఇతివృత్తంతో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆచార్యలో రాంచరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా… కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్గా వస్తున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్గా వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాలతోపాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.