చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకక్కించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించారు.రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ ని విడుదల చేశారు.
నీలాంబరి అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన నృత్యంతో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే లుక్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. నీలాంబరి’ అంటూ సాగే బ్యూటీ ఫుల్ మెలోడీని రేపు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.