రాజకీయాలకు దూరమైన తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మళ్లీ సినిమాల్లో యాక్టివ్ గా దూసుకెళ్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఆచార్య (Acharya) విడుదలకు ముస్తాబవుతోంది. కాగా లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ఫాదర్ (Godfather) ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మోహన్ రాజా (Mohan Raja)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతోపాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదాళమ్ రీమేక్, బాబీ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతానికి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న చిరుకు మరో రీమేక్ పై కన్ను పడిందన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ చిరంజీవి ఎంపిక చేసిన ఆ రీమేక్ ఏంటో తెలుసా..? గౌతమ్ మీనన్-అజిత్ డైరెక్షన్ లో వచ్చిన యెన్నై అరిందాల్ (Yennai Arindhaal) (2015). ఈ సినిమాకు ఇంప్రెస్ అవడంతో రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఓ యువతిని క్రిమినల్ నుంచి కాపాడే మాజీ పోలీసాఫీసర్ పాత్రలో చిరు కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం సరైన డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడట చిరు.
ఇక సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ హౌజ్ పై ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించబోతున్నాడని వినిపిస్తోండగా..తన తండ్రిని సిల్వర్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా చూపించే దర్శకుడి కోసం వెతుకుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. మొత్తానికి మెగా స్టార్ హీరోలిద్దరికీ ఏ స్టార్ డైరెక్టర్ తారసపడతాడో చూడాలి మరి.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర