రీల్ లైఫ్ లో లవ్ బర్డ్స్ గా ఆడియెన్స్ ను అలరించారు నాగచైతన్య-సమంత. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. రియల్లైఫ్ లో కపుల్ గా మారిన తర్వాత కూడా తమ అభిమానుల కోసం సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. ఈ జంట మరో ప్రాజెక్టుతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారన్న వార్త టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబోలో రాబోతున్న చిత్రం బంగార్రాజు..లాక్ డౌన్ ముగిసిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్టులో నటించేందుకు చైతూ-సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతూ. షూటింగ్ దశలో ఉందీ సినిమా.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించనుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేయబోతున్న శాకుంతలం చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
Recommended Content by ntnews.com