తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది పూజాహెగ్డే. ఈ భామ ఇటీవలే కోవిడ్ బారిన పడిన అనంతరం కోలుకుంది. లాక్ డౌన్ పీరియడ్లో ఈ భామ ఏం చేస్తుందోనని ఫాలోవర్లు తెగ ఆలోచిస్తుండగా..దీనిపై ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ కాలంలో పూజాహెగ్డే ముఖ్యంగా స్క్రిప్టులపై ఎక్కువ సమయం కేటాయిస్తుందట.
షూటింగ్ కు గ్యాప్ వచ్చినా తనలోని యాక్టింగ్ స్కిల్కు మాత్రం విశ్రాంతి ఇవ్వకుండా..సినిమాల్లో తాను పోషించబోయే పాత్రలపై ఫోకస్ పెట్టిందట. అంతేకాదు పలువురు బాలీవుడ్, దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ సిద్దం చేసిన కథలను కూడా పూజా హెగ్డే విన్నట్టు టాక్. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పూజాహెగ్డే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ కానుందని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
పూజాహెగ్డే తెలుగులో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, రాధేశ్యామ్ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్