Captain Miller | స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ (Captain Miller)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ధనుష్ చాలా కాలంగా లాంగ్హెయిర్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా ఎవరూ ఊహించని లుక్లోకి మారిపోయాడు. ధనుష్ ఇవాళ ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ధనుష్ దర్శనానంతరం తిరుమలేశుడికి తలనీలాలు సమర్పించుకున్నాడు.
ఇన్నాళ్లూ కెప్టెన్ మిల్లర్ కోసం లాంగ్హెయిర్తో కనిపించిన ధనుష్.. షూటింగ్ పూర్తవడంతో స్వామి వారి సేవలో ఇలా గుండు చేయించుకొని కొత్త లుక్లోకి మారాడు. ధనుష్ నయా లుక్ చూసిన అభిమానులు స్టన్ అవుతున్నారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్టందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షురూ కానున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది ధనుష్ టీం.
ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్లో ఇప్పటికే Raanjhanaa, అట్రాంగి రే సినిమాలు వచ్చాయి. మూడోసారి రాబోతున్న ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మ్యూజిక్ లవర్స్.
Actor #Dhanush‘s new look.
The star has tonsured his head today in Tirupati temple. pic.twitter.com/uKt0SMFNOY
— Manobala Vijayabalan (@ManobalaV) July 3, 2023