Priyanka Gandhi : ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగాంధీ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళా భక్తులు ఆమె మెడలో బచ్చీసాల దండ, బంతిపూల దండ, కాషాయం కండువా కప్పి సత్కరించారు.
అనంతరం ప్రియాంకాగాంధీ కొబ్బరికాయ కొట్టి ఆలయం నుంచి బయటికి వచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ గురుద్వారాకు చేరుకున్నారు. అక్కడ సిక్కు భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ప్రియాంకాగాంధీ మానసా దేవి ఆలయాన్ని, గురుద్వారాను సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offered prayers at Mansa Devi temple and a gurudwara in Uttar Pradesh’s Amethi today
(Video source: Congress) pic.twitter.com/MUc6e0LIpg
— ANI (@ANI) May 18, 2024