తమిళ స్టార్ ధనుష్కు టాలీవుడ్ టైర్-2 హీరోలకున్న క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈయన తెలుగులో మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇటీవలే ‘తిరు’తో భారీ విజయాన్ని సాధించిన ధనుష్.. అదే జోష్తో వరుసగా సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘కెప్టెన్ మిల్లర్’ ఒకటి. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరణ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఈ క్రమంలో చిత్రబృందం ధనుష్ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం చెన్నైలో గ్రాండ్గా జరుగన్నునాయి. కాగా ఈ ఈవెంట్ వీడియోను సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం ధనుష్ కెరీర్లో అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాకుండా 1930-40 టైం పీరియడ్లో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ధనుష్కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. జీ. వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జోతి బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
Read Also:
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Prince Movie | ‘ప్రిన్స్’ సెకండ్ సింగిల్ రిలీజ్.. థమన్ వాయిస్ అదరహో..!