Allu Arjun with boyapati | అఖండ సినిమాతో మరోసారి ఫామ్లోకి వచ్చాడు సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన గత సినిమా వినయ విధేయ రామ దారుణంగా నిరాశ పరచడంతో చాలా రోజుల వరకు కనీసం కథ వినడానికి కూడా హీరోలు ఆసక్తి చూపించలేదు. అయితే అఖండ సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్నాడు ఈ దర్శకుడు. దాంతో మరోసారి బోయపాటితో సినిమా కోసం హీరోలు క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా కథ లేకుండా అఖండ సినిమాతో ఆయన చేసిన మ్యాజిక్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. బాలకృష్ణను ఎలా చూడాలి అనుకుంటున్నారో అభిమానులకు అలా చూపించి సూపర్ హిట్ కొట్టాడు. దాంతో హీరోలను మాస్ యాంగిల్ చూపించాలి అంటే బోయపాటి శీను ఆరితేరిపోయాడు అంటూ నిర్మాతలు ఆయన వెంట పడుతున్నారు.
ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అని వినిపిస్తోంది. ఈ మధ్యే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ.. వచ్చే ఏడాది కూడా పుష్ప సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండు భాగాలుగా సుకుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా మొదటి పార్ట్ ఇప్పుడు విడుదలైంది. వచ్చే సంవత్సరం రెండో పార్ట్ విడుదల కానుంది. దీని కోసం మరో ఏడాది కేటాయించి ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత కానీ తన నెక్ట్స్ మూవీ గురించి ఆలోచించడం కష్టం. అయితే ఆ తర్వాత ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చింది నెగిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా 70 కోట్ల షేర్ వసూలు చేసి సంచలన విజయం సాధించింది. బన్నీ కెరీర్లో అంతకంటే మాస్ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ బోయపాటి ఒక మాస్ కథ నెరేట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అక్కడ పుష్ప ఊచకోత మామూలుగా లేదు.. కలెక్షన్ల ప్రభంజనం..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
పుష్పలో ఐటెం సాంగ్కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
అఖండ సినిమాలో నటించిన ఎడ్లు మన చౌటుప్పల్ రైతువే..అవకాశం ఎలా వచ్చిందంటే?