తెలుగు సినీ పరిశ్రమకు బొమ్మరిల్లు లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ సినిమాను అందించి..ఆ టైటిల్ నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar). ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో తీసిన పరుగు చిత్రం మంచి విజయం అందుకుంది. అయితే రాంచరణ్ హీరోగా నాగబాబు (Nagababu) నిర్మించిన ఆరెంజ్ చిత్రం దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. ఆరెంజ్ (Orange) తీసుకొచ్చిన భారీ నష్టాలతో నాగబాబు తీవ్రమైన ఒత్తిడికి లోనయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ అండగా నిలువడంతో ఆర్థికంగా ఏర్పడిన నష్టాల గురించి నాగబాబుకు ఉపశమనం లభించింది. దీనికి సంబంధించిన ప్రశ్న పదే పదే రిపీట్ అవుతూ ఇపుడు బొమ్మరిల్లు భాస్కర్ కు తలనొప్పిగా మారిందన్న వార్త టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది భాస్కర్ టీం.
ఆరెంజ్ భారీ నష్టాలు ఎదుర్కొన్న టైంలో నాగబాబు పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు సున్నితంగా సమాధామిచ్చాడు భాస్కర్. నేను ఆరెంజ్ సినిమా కోసం స్క్రిప్ట్ నుండి ఫైలింగ్, కాస్ట్యూమ్స్ నుండి మ్యూజిక్ వరకు చాలా కష్టపడ్డాను. ఇప్పటికీ దీన్ని కొందరు కల్ట్ చిత్రంగా భావిస్తున్నారు. అయితే ఆరెంజ్ ను ఇప్పుడు విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ వెళ్లాలి. అయితే భారీ నష్టాలు వచ్చిన సమయంలో పలు రకాలైన విషయాలు బయటకొస్తాయి. ఏ విషయాన్ని అతిశయోక్తి చేయాల్సిన అవసరం లేదంటూ జవాబిచ్చాడు.
బాక్సాపీస్ వద్ద ఆరెంజ్ చిత్రం ప్లాప్ టాక్ మూటకట్టుకున్నా అల్లు అర్జున్, రాంచరణ్ మాత్రం తనకు అండగా నిలిచారని కాంట్రవర్సీలకు చోటు లేకుండా సమాధానమిచ్చాడు భాస్కర్.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!