Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన లేటెస్ట్గా నటించిన ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఈయన హీరోగా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య నిర్మలా దేవి ఈ కాంబినేషన్లో సినిమా ఉందని క్లారిటి ఇచ్చింది. ప్రస్తుతం మారుతీ పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.
ప్రభాస్కు జోడిగా ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. రాశిఖన్నా, మాళవిక మోహన్ ఇద్దరు కథానాయికలుగా ఫిక్సయ్యారని సమాచారం. ఈ చిత్రానికి ‘రాజాడిలక్స్’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంచినట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో బోమన్ ఇరాని ఓ భూతంగా కనిపిస్తారని.. ఆయన పాత్ర కథలో కీలకమైనదని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక పెద్ద బంగ్లా సెట్ నిర్మాణం మొదలైందని టాక్. ప్రభాస్ ఈ చిత్రానికి 100రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. కృతీ సనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. దీంతో పాటుగా ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్ దశలో ఉంది.
ఇవి కూడా చదవండి:
Simbu | తమిళ హీరో శింబు కారు ఢీ కొని వికలాంగుడు మృతి.. వైరల్ అవుతున్న వీడియో
S.S.Rajamouli | రాజమౌళి సినిమాలు ఎందుకంత స్పెషల్గా ఉంటాయి!
Allu Arjun | ఆ ఘనత అల్లుఅర్జున్కు మాత్రమే దక్కింది?
Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్లో.. దిశా పటాని?