Simbu | తమిళ హీరో శింబు కారు ఢీకొని చెన్నైలోని టీ నగర్లో రోడ్డు పక్కన నివసించే వికలాంగుడు మునుస్వామి మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శింబు తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ గత శుక్రవారం రాత్రి డ్రైవర్తో పాటు కారులో వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న మరో కారు వెలుతురులో డ్రైవర్ గమనించక.. రోడ్డు పై పాకుతూ వెళ్తున్న వికలాంగుడిపై కారుని ఎక్కించాడు. దాంతో ఆ వికలాంకుడు తీవ్ర గాయల పాలైయ్యాడు. అది గమనించిన రాజేందర్ వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి కూడా డ్రైవర్ను పంపించాడు.
వారం రోజులుగా చికిత్స పొందుతున్న మునుస్వామి(70) గురువారం రాత్రి మృతి చెందాడు. దాంతో ప్రమాదానికి కారణమైన శింబు కారు డ్రైవర్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. యాక్సిడెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాదానికి గురైన కారు శింబు పేరు మీద ఉండటంతో శింబుపై కేసు నమోదు చేశారు. గతేడాది మానాడుతో బ్లాక్ బస్టర్ను అందుకున్నాడు. అదే స్పీడులో వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. kollywood
Cctv footage of a differently abled man being run over by a car that belonged to actor Simbu’s father and director T Rajendran at T Nagar 😡😡😡 pic.twitter.com/61p75vU6EN
— Maan kumar Maan (@MaankumarMaan2) March 23, 2022