కొడుకు పుట్టాడని ఆనందపడాలో.. ఆరోగ్యం బాగోలేదని బాధ పడాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. పుట్టినప్పటి నుంచి ఐసీయూలోనే ఉంటే అంతకంటే దారుణం మరోటి ఉంటుందా..? ఆ తల్లి ప్రాణం ఎంతగా తల్లడిల్లిపోతుందో..? దియా మీర్జాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఈమెకు కొడుకు పుట్టాడని ఆనందించేలోపే.. ఆ చిన్ని ప్రాణాన్ని తీసుకెళ్లి ఐసీయూలో ఉంచారు.
ఫిబ్రవరి 15న తన ప్రియుడు వైభవ్ రాఖీని పెళ్లి చేసుకుంది దియా మీర్జా. అయితే పెళ్లికి ముందు గర్భవతి అయింది దియా. ఇదే విషయం మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పింది. అందులో దాపరికం ఏం లేదని చెప్పుకొచ్చింది ఈమె. అలా పెళ్లైన నాలుగు నెలలకే ఓ బాబుకు జన్మనిచ్చింది దియా. వైద్యులు ఇచ్చిన తేదీ కంటే నెల రోజుల ముందుగానే సి సెక్షన్ నుంచి బాబు పుట్టాడు. అయితే పుట్టడమే అనారోగ్య కారణాలతో జన్మించాడు ఆ అబ్బాయి. దాంతో మే 14న బాబు పుడితే.. అప్పట్నుంచి కూడా ఐసీయూలోనే ఉన్నాడు. అంటే దాదాపు రెండు నెలలుగా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఎమోషనల్ స్టోరీని ట్వీట్ చేసింది దియా మీర్జా. పుట్టినప్పటి నుంచి తమ బాబు ఐసీయూలోనే ఉన్నాడని.. వాడి కోసమే తమ కళ్లన్నీ వేచి చూస్తున్నాయని కన్నీటి పర్యంతమైంది.
ప్రస్తుతం ఈ బాబు క్షేమంగా ఉన్నాడు. డాక్టర్లు, నర్సుల నిరంతర కృషితో ఈ రోజు తమ బాబు సేఫ్ అయ్యాడని.. త్వరలోనే ఇంటికి కూడా రాబోతున్నాడని చెప్పింది దియా. తన కొడుకు అవ్యాన్ రాఖీ అని చెప్పుకొచ్చింది. వాడి కోసం ఇంటి దగ్గర అక్కతో పాటు.. అతడి నానమ్మ, తాతయ్యలు కూడా ఎదురుచూస్తున్నారంటూ ట్వీట్ చేసింది. దియా మీర్జాకు ఇది రెండో వివాహం. గతంలో నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది దియా. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది దియా మీర్జా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
ప్రశాంత్ నీల్.. నాలుగు నెలల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలు
ఇండస్ట్రీలోకి కోడిరామకృష్ణ కూతురు ఎంట్రీ..!