తెలుగు చలన చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు దివంగత టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ. సినీ పరిశ్రమలోకి ఇపుడు కోడిరామకృష్ణ వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా మారుతున్నారు. కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు దివ్య దీప్తి. జులై 15న తన మొదటి ప్రాజెక్టును ప్రకటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రాన్ని కార్తీక్ శంకర్ (డెబ్యూట్ డైరెక్టర్) డైరెక్ట్ చేయబోతున్నాడు. దివ్య తన మొదటి సినిమాకు తండ్రి కోడి రామకృష్ణ పేరును సమర్పకుడిగా యాడ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర వివరాలపై రేపు క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కోడిరామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న మరణించారు. ఆయన వారసురాలిగా దివ్య దీప్తి మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!