Ram Gopal Varma | టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్మపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. వర్మపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన ఘటనలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.. దీంతోపాటు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో వర్మ మీద కేసులు నమోదు కాగా.. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కేసు సాగిందిలా..
మద్దిపాడు పీఎస్లో నమోదైన కేసులో ఏపీ పోలీసులు పలు మార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇటీవలే ఈ కేసులో రాంగోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Fear Trailer | సైలెంట్గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్గా వేదిక ఫియర్ ట్రైలర్