ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushanth Singh Rajput). స్టార్ యాక్టర్గా లీడింగ్ పొజిషన్కు చేరుకుంటున్న సమయంలో సుశాంత్ సింగ్ ఆకస్మికంగా మృతి చెందడటంతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు దాటిపోతున్నా.. అతడి మరణం మిస్టరీగానే ఉండిపోయింది.
అటు ముంబై పోలీసులు కానీ.. ఇటు సీఐడీ బృందం కానీ ఈ కేసును ఎటూ తేల్చలేకపోయారు. కాగా ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) టీం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. సుశాంత్ కేసు విచారణ సమయంలో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తికి బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే 44 సార్లు కాల్ చేశాడని ఆరోపించడం ఇపుడు కొత్త అనుమానాలను లేవనెత్తుతోంది.
ఈ హైప్రొఫైల్ కేసులో హస్తమున్నట్టు వస్తున్న తాజా ఆరోపణలపై ఆదిత్య ఠాక్రే టీం ఇప్పటివరకు స్పందించలేదు. తాజా ఆరోపణల నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి మరి.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ