హిందీ (Hindi Films) సినిమా అంటే నేషనల్ సినిమా అని, తెలుగు చిత్రాలు (Telugu movies) అంటే ప్రాంతీయ సినిమాలు అనే భావన ఒకప్పుడు ఉండేది. బాలీవుడ్ (Bollywood) లో బడా నిర్మాణ సంస్థలు, దర్శకనిర్మాతలు దక్షిణాది రాష్ట్రాలపైన ఎప్పుడూ ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక రాయి వేసినట్టుగా దక్షిణాదిని టచ్ చేశారే..తప్ప హిందీ సినిమాలో ఇక్కడ విడుదల చేసే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు.
యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films) బ్యానర్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన పృథ్విరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జనవరి 2022లోనే విడుదల కావాల్సింది. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఫైనల్గా జూన్ 3న విడుదల తేదీని ఫిక్స్ చేశారు. అయితే నెలల తరబడి సినిమా వాయిదా వేస్తూ వచ్చిన యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ తాము చేసిన తప్పేంటో తెలుసుకుందట.
ఇప్పటికైనా మించి పోయిందేమి లేదనే ఆలోచనకు యశ్ రాజ్ ఫిలింస్ వచ్చేసిందని టాక్. అందుకే అక్షయ్కుమార్ చిత్రాన్ని తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నదని బీటౌన్ సర్కిల్ సమాచారం. హిందీ వెర్షన్తోపాటు ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. కొన్ని సంవత్సరాలుగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ సినిమాల విషయంలో యశ్ రాజ్ ఫిలింస్ అంతగా ఆసక్తిచూపలేదు.
దక్షిణాదిన విడుదల చేయడంపై కానీ, ప్రమోషన్స్ విషయాన్ని కానీ అంతగా సీరియస్గా తీసుకోలేదు. అయితే ఇపుడు మాత్రం సీరియస్ గా ప్రమోషనల్ ప్లాన్స్ చేస్తున్నామని, డెబ్యూట్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ (Manushi Chillar) తో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నామని చెబుతున్నారు. మరి అక్షయ్కుమార్, మానుషి నటించిన పృథ్విరాజ్ చౌహాన్ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.