ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ట్రాక్పైకి వచ్చే పనిలో పడ్డాడు సీనియర్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh). ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వేదాళమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భోళాశంకర్ (Bholaa Shankar) టైటిల్తో తెరకక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా షూటింగ్ షెడ్యూల్తో బిజీగా ఉండే మెహర్ రమేశ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మెహర్ రమేశ్ ప్రసిద్ద శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి టెంపుల్, సింహాచలం ఆలయాలను సందర్శించాడు.
మెహర్ రమేశ్తో పాటు అతని స్నేహితుడు, భోళాశంకర్ సినిమాటోగ్రఫర్ డూడ్లీ (Dudley) కూడా టెంపుల్ను సందర్శించిన వారిలో ఉన్నాడు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజర్. మెహర్ రమేశ్ కేవలం ఆధ్యాత్మిక చింతనలో భాగంగానే టెంపుల్ విజిట్ చేశాడా..? లేదంటే..? సినిమా లొకేషన్ల వేటలో భాగంగా అక్కడికి వెళ్లాడా..? అనేది తెలియాల్సి ఉంది.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం,
సింహాచలం 🙏🏻
Devine visit of Sri VarahlaksmiNarsimhaswamy temple 🙏🏻#SimhachalamTemple along with my dear friend &Dop @dudlyraj pic.twitter.com/sXPwKn0jp6— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) April 14, 2022
గతంలో వీకెండ్ సమయంలో తనకిష్టమైన బైక్ రైడ్ ట్రిప్ వేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. మెహర్ రమేశ్ స్టైలిష్ లుక్లో బైక్ రైడ్లో పాల్గొన్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి.