Akhanda | బాలకృష్ణ సినిమా అంటే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కామన్. ఎందుకంటే అభిమానులు ఆయన నుంచి అలాంటి యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా పెడతారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన అఖండ సినిమాలో కూడా ఇలాంటి పొలిటికల్ హీట్ పెంచే సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. బోయపాటి దర్శకుడు అంటే ఎమోషనల్ సన్నివేశాలు ఎలా ఉంటాయో అందరూ అర్థం చేసుకోవచ్చు.
రాజకీయంగా ఉండే సన్నివేశాలు కూడా ఈయన చాలా హై వోల్టేజ్ లో తెరకెక్కిస్తుంటాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమాలు చూస్తే ఈ విషయం మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అఖండ సినిమాలో కూడా ఇలాంటి హై వోల్టేజ్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంపై బాలకృష్ణ దారుణంగా విరుచుకుపడతాడని తెలుస్తోంది. కొన్ని నెలల కింద ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనపై హిందూ మత పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఈ విషయం ఉండబోతుందని.. దీని గురించి సీరియస్గా డిస్కస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిందూ దేవాలయాల విషయంలో జగన్ ప్రభుత్వంపై ఓపెన్ సెటైర్స్ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. కచ్చితంగా సినిమా విడుదలైన తర్వాత ఈ విషయంపై ఏపీలో పెద్ద దుమారం రేగడం ఖాయమనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. బాలకృష్ణ విరుచుకుపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముందు వెనకా చూడకుండా దబిడి దిబిడే. ఇప్పుడు అఖండ సినిమా విషయంలో ఇదే జరగబోతుంది. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా అఖండ సినిమా విడుదల అవుతుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక ఒకవేళ నిజంగానే జగన్ ప్రభుత్వాన్ని బాలకృష్ణ టార్గెట్ చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?
Nayanthara: కొత్త ఇంట్లోకి నయనతార.. ఎక్కడో తెలుసా?
అఖండ మూవీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ కు టెస్టింగ్ టైమ్..
ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?