చెన్నై: స్టాలిన్ను ఆయన తండ్రి కురుణానిధి నమ్మలేదని, ఇక ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తిరువన్నమలైలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్పై మండిపడ్డారు. కరుణానిధి స్వయంగా స్టాలిన్ను నమ్మలేదని అన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడినప్పటికీ తన చివరి రెండేళ్ళలో కూడా పార్టీని స్టాలిన్కు అప్పగించలేదని తెలిపారు. తన కొడుకును కరుణానిధి నమ్మలేదు కాబట్టే ఈ పని చేయలేదని చెప్పారు. అలాంటి స్టాలిన్ను ప్రజలు ఎలా నమ్ముతారని పళనిస్వామి ప్రశ్నించారు.