బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ శనివారం(మే 1) 33వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనుష్క బర్త్డే సందర్భంగా ఆమెకు అభిమానులు, శ్రేయోభిలాషులు, పలుఉవరు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. కూతురు పుట్టాక అనుష్కకు ఇది తొలి బర్త్డే. చాలా స్పెషల్.అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో తన బర్త్డే జరుపుకోవడం భావ్యం కాదని, అందుకే వేడుకలకు దూరంగా ఉన్నానంటూ ఓ వీడియో ద్వారా వెల్లడించింది.
దేశంలో కోవిడ్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో నేను పుట్టిన రోజు జరుపుకోవాలనుకోలేదు. అందరం ఏకంగా నిలవాల్సిన సమయం వచ్చింది.విరాట్ నేను మా వంతు కృషి చేస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలు పంచుకుంటాము. మీరు కూడా ఈ సమయంలో మీ వంతు బాధ్యతగా పలువురికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని అనుష్క వీడియోలో పేర్కొంది. కాగా, 2017లో విరాట్ను వివాహం చేసుకున్న అనుష్క శర్మ ఈ ఏడాది జనవరిలో వామిక అనే చిన్నారికి జన్మనిచ్చింది.