ఆలేరు టౌన్, జూన్ 8 : వాహనదారులు నిబంధనలు పా టించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఆలేరులో మం గళవారం ఆయన జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అనుమతి లేకుండా ప్రయాణించొ ద్దని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ నర్సయ్య, ఎస్ఐ రమేశ్ ఉన్నారు.
ఇండ్లల్లోనే ప్రజలు
మోత్కూరు, జూన్ 8: మండలంలో లాక్డౌన్ 28వ రోజు ప్రశాంతంగా జరిగింది. ప్రజలు సడలింపు సమయంలో నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే వ్యాపారులు షాపులను మూసేశారు. ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పాటిమట్ల క్రాస్ రోడ్డు, అనాజిపురం చౌరస్తాలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనదారులకు జరిమానా విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఉదయ్కిరణ్ హెచ్చరించారు.
సడలింపు సమయంలో నిత్యావసరాల కొనుగోలు
ఆత్మకూరు(ఎం), జూన్8: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు ఉద యం ఆరు గంటలకు షాపులు తెరిచి మధ్యాహ్నం ఒంటిగంటలోపే మూసేశారు. ప్రజలు సడలింపు సమయంలో నిత్యావసరాలను కొనుగోలు చేశారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్ఐ ఇద్రిస్ అలీ కోరారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, జూన్ 8 : మండలంలో 28వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6గంటలకు వ్యాపారులు షాపులు తెరిచి మధ్యాహ్నం 1గంటలోపే మూసేశారు. ప్రజలు సడలింపు సమయంలో నిత్యావసరాలను కొనుగోలు చేసి ఇండ్లకే పరిమితం కావడంతో మండలంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
నిర్మానుష్యంగా రోడ్లు
రామన్నపేట, జూన్8: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటలోపే వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. రెండుగంటల తరువాత జనం రోడ్లపైకి రాకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. పోలీస్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ వాహనాలను తనిఖీ చేశారు.
ప్రజలు సహకరించాలి
బొమ్మలరామారం, జూన్8 : కొవిడ్ కట్టడికి ప్రజలు సహకరించాలని ఎస్ఐ వెంకన్న అన్నారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మంగళవారం లాక్డౌన్ ప్రశాంతం గా జరిగింది. సడలింపు సమయంలోనే ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మధ్యా హ్నం ఒంటిగంట లోపు వ్యాపారులు షాపులను మూసివేశారు.
ప్రశాంతంగా లాక్డౌన్
గుండాల, జూన్8: మండలంలో లాక్డౌన్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకే వ్యాపారులు దుకాణాలను మూసేశారు. ప్రజలు మధ్యాహ్నం రెం డు గంటల తర్వాత బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు మండలంలో లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు.