మహమ్మారి కరోనా వలన అయితేనేమి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల వలన అయితేనేమి గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా సీనియర్ గాయకుడు జి.ఆనంద్(67) కరోనాతో కన్నుమూశారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం. ఐదు దశాబ్దాలుగా సినీ రగంలో కొనసాగుతూ వస్తున్న ఆనంద్ స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామానికి చెందిన ఆనంద్.. ‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి సూపర్ హిట్ పాటలను పాడారు.సీరియల్స్కు,అనువాద చిత్రాలకు సంగీత సారథ్యం కూడా వహించారు ఆనంద్. ఆయన మృతి తోటి సింగర్స్కు షాకింగ్గా మారింది. ఆనంద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.