కుమ్రం భీం ఆసిఫాబాద్ డీపీవో శ్రీకాంత్
గ్రామాల్లో నర్సరీల పరిశీలన
బెజ్జూర్, జూన్ 17 : హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీ కాంత్ అన్నారు. మండలంలోని సలుగుపల్లి గ్రా మంలోని నర్సరీని గురువారం పరిశీలించారు. ఏయే మొక్కలు, ఎన్ని పెంచుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుకిరువైపులా, చేలు, పొలాల గట్లు, తదితర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. అనంతరం శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్ను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువును తయారు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో రమేశ్ రెడ్డి, సర్పంచ్ కర్పెత స్వప్న, కార్యదర్శి ఇస్తారి పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
పెంచికల్పేట్, జూన్ 17: మండలంలోని దరొగొపల్లి, చేడ్వాయి, పోతెపల్లి, బొంబాయిగూడ గ్రా మాల్లో డీపీవో శ్రీకాంత్ పర్యటించారు. పల్లె ప్రకృ తి వనాలు, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలిం చి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ఈనెల 20 నుంచి గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే (సెగ్రిగేషన్) ప్రక్రియను ప్రారంభించాలని మండల అధికారులను ఆదేశించారు. హరితహారం ప్రణాళిక సిద్ధం చేసి మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ చర్య లు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో శ్రీ నివా స్, ఎం పీవో గంగాసింగ్, ఏపీవో సతీశ్, టీఏ లు మహేశ్, సురేశ్, స ర్పంచ్లు, దేవాజీ, సు జా త, చంద్రమౌళి, కళావతి, నాయకులు శ్రీనివా స్, బా పురావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.