లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య (Allu Ramalingaih) జయంతిని పురస్కరించుకుని ఇప్పటికే అల్లు ఫ్యామిలీ భారీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా హైదరాబాద్లోని గండిపేట ప్రాంతం ( Gandipet area)లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫిల్మ్ స్టూడియో ( state of the art film studio )ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ అల్లు స్టూడియోస్ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారట. తాజా టాక్ ప్రకారం అక్టోబర్ 1న భారీ స్థాయిలో స్టూడియో లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ మేకింగ్కు అవసరమైన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో 10 ఎకరాలకుపైగా ఈ స్టూడియో ఉండనుందని సమాచారం. రానున్న రోజుల్లో అల్లు అరవింద్ తన కుమారులు బాబీ, అల్లు అర్జున్, శిరీష్తో కలిసి స్టూడియో బాధ్యతలను చూసుకోనున్నారట.
అల్లు స్టూడియోస్ ప్రారంభకార్యక్రమానికి ప్రత్యేక అతిథి రాబోతుండగా..ఇంతకీ వారెవరనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూనే..మరోవైపు అల్లు అర్జున్ ద్వారా అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. శిరీష్ కూడా యాక్టింగ్లో కొనసాగుతుండగా..బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.