ఆత్మకూరు(ఎం), జూలై13: సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షంతోపాటు వరద నీటి ప్రభావానికి రాయిపల్లి, మొరిపిరాల, కొరటికల్ గ్రామాల్లోని బిక్కేరువాగు మంగళవారం ఉధృతంగా ప్రవహించింది. మండల కేంద్రం పరిధిలోని కామునిగూ డెం బిక్కేరువాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నుంచి కూడా వర్షపు నీరు ప్రవహించింది. కురిసిన వర్షంతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరడంతో వివిధ గ్రామాల రైతులు, ప్రజ లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కామునిగూడెంలోని బిక్కేరు వాగుపై రూ.కోటీ37 లక్షలతో చెక్ డ్యాం నిర్మించడంతో నేడు వర్షపు నీరు చెక్డ్యాంపై నుంచి ప్రవహించడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ నాయకులు పూజలు నిర్వహించగా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తుర్కపల్లి మండలంలో అత్యధికంగా..
భువనగిరి అర్బన్, జూలై 13: జిల్లాలోని తుర్కపల్లి మండలంలో 77.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా చౌటుప్పల్ మండలంలో 1.0 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని పలు మం డలాల్లో ఓ మోస్త్తరు వర్షం సోమవారం రాత్రి నుంచి మం గళవారం ఉదయం వరకు కురిసింది. వివరాల ప్రకారం రాజాపేట మండలంలో 21.8 మి.మీ, ఆలేరు మండలం లో 50.8మి.మీ, యాదగిరిగుట్ట మండలంలో 50.0 మి.మీ, భువనగిరిలో 36.4మి.మీ, బొమ్మలరామారం మండలంలో 13.4మి.మీ, బీబీనగర్ మండలంలో 26.2 మి.మీ, భూదాన్పోచంపల్లి మండలంలో 28.6మి.మీ, చౌటుప్పల్ మండలంలో 1.0మి.మీ, వలిగొండలో 32.4 మి.మీ, ఆత్మకూర్(ఎం)లో 43.6 మి.మీ, మోత్కూర్లో 36.6 మి.మీ, గుండాలలో 42.4మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రవహిస్తున్న బృందావన్ కాల్వ
మోత్కూరు, జూలై13: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోత్కూరు మండల పరిధిలోని బృందావన్కాల్వ ప్రవహిస్తున్నది. ఆత్మకూరు(ఎం)మండల పరిసర గ్రామా ల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు వరద నీరు చేరి బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మోత్కూరు బిక్కేరు వాగుకు అనుసంధానంగా ఉన్న బృందావన్ కాల్వ గుండా వరద నీరు పెద్ద చెరువులోకి వచ్చి చేరుతున్నది.
ఆనకట్ట నుంచి చెరువులోకి వెళ్లే కాలువకు గండి
ఆత్మకూరు(ఎం), జూలై13: మండలంలోని రాయిపల్లి బిక్కేరువాగుపై నిర్మించిన ఆనకట్ట నుంచి మొరిపిరాల చెరువులోకి వెళ్లే కాలువకు మంగళవారం గండి పడటంతో కాలువ నీరు వృథాగా బిక్కేరు వాగులోకి వెళ్లింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయించాలని మొరిపిరాల సర్పంచ్తిర్మల్రెడ్డితోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.