సినీ ఇండస్ట్రీలో రిలీజ్ టైంకు బాక్సాపీస్ వద్ద స్టార్ హీరోల మధ్య ఫైట్ జరుగడం సర్వసాధారణమైన విషయమే. అయితే కరోనా పుణ్యమా అని..స్టార్ హీరోల సినిమాల మధ్య ఫైట్ చూసి చాలా రోజులే అవుతుంది. ఇంతకీ ఈ టాపిక్ రావడానికి కారణమేంటనుకుంటున్నారా..? అక్షయ్ కుమార్ (Akshay Kumar), అమీర్ఖాన్ (Aamir Khan). బాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో టాప్లో ఉండే ఈ ఇద్దరు చాలా కాలం తర్వాత బాక్సాపీస్ ఫైట్కు మళ్లీ రెడీ అవుతున్నారు.
అమీర్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం లాల్ సింగ్ ఛద్ధా. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు అక్షయ్ కుమార్ నటిస్తోన్న రక్షా బంధన్ కూడా ఇదే రోజు రిలీజవుతోంది. కంటెంట్ పరంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. అమీర్ఖాన్తో బాక్సాపీస్ పోరు గురించి మాట్లాడుతూ..సున్నితంగా సమాధానమిచ్చాడు. రెండు లేదా ఎక్కువ హాలీడేస్తో మంచి వీకెండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ హాలీడేస్ రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఇస్తాయన్నాడు. అంతేకాదు గతంలో తాను నటించిన ‘Welcome’ అమీర్ ఖాన్ నటించిన ‘Taare Zameen Par’ చిత్రాలు ఒకేసారి విడుదలై బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయని గుర్తు చేశాడు అక్షయ్. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో రాబోతున్న రక్షాబంధన్లో భూమి పెడ్నేకర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ఇక అద్వైత్ చందన్ డైరెక్షన్లో వస్తున్న లాల్ సింగ్ చద్ధాలో కరీనాకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా..నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!