న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏఐ టూల్స్పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఆర్టిస్ట్ల ఊహాశక్తికీ ఏఐ (Viral Post) రెక్కలు తొడుగుతోంది. మిడ్జర్నీ వంటి యాప్స్ ఉపయోగిస్తూ కొన్ని క్రియేటివ్ ఇమేజెస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ యాప్స్ను వాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిస్టులు ఆసక్తికరమైన ఇమేజ్లను సృష్టిస్తున్నారు.
ఇక లేటెస్ట్గా మన హీరోలు వయసు మళ్లితే ఎలా ఉంటారనే ఇమేజ్లను ఏఐ ఆర్టిస్ట్ ఎస్కే ఎండీ అబు సాహిద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, రణ్బీర్ కపూర్తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. ఏఐ ఇమేజిన్స్ యాక్టర్స్ యాజ్ ఓల్డ్ మ్యాన్ అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలపై నెటిజన్లన నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Read More