రీసెంట్గా సన్నాఫ్ ఆఫ్ ఇండియా (Son of India) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సన్నాఫ్ ఇండియా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu). ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు తన కూతురు లక్ష్మీప్రసన్న (Lakshmi Prasanna)తో కలిసి కొత్త సినిమాను ప్రకటించాడు.
నెక్ట్స్ మూవీ అగ్ని నక్షత్రం (Agninakshatram)ను ప్రకటిస్తూ..టైటిల్ లుక్ను లాంఛ్ చేశాడు. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మోహన్ బాబు, లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. పోలీస్ వాహనం చీకట్లో వెళ్తూ సైరన్ మోగిస్తూ వెళ్తున్న విజువల్స్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా సాగుతుంది.
ప్రతీక్ జోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం క్రైం డ్రామా నేపథ్యంలో సాగనున్నట్టు తాజా వీడియోతో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ , మంచు ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లిజో కే జోష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్.
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!