బాహుబలి (Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ (Prabhas) ఇటీవలే రాధేశ్యామ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. నెక్ట్స్ ఆది పురుష్ (Adipurush) సినిమాతో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. పురాణేతిహాసం రామాయణం ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
తన జీవితంలో ఆదిపురుష్ చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని అన్నాడు ప్రభాస్. ప్రభాస్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూపలు విషయాలు పంచుకున్నాడు..ఆదిపురుష్ సెంటిమెంట్ పరంగా నా జీవితంలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అదృష్టవశాత్తు ఓం రౌత్ (Om Raut) లాంటి మంచి డైరెక్టర్ ఉన్నాడు. సినిమా మొదలయ్యాక మూడు రోజుల తర్వాత నేనిది చేయొచ్చా..? అని డైరెక్టర్ను అడిగాను. ఎందుకంటే నేనేదైనా తప్పు చేస్తే అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు ప్రభాస్.
ఆది పురుష్ కేవలం సినిమానే కాదు..చాలా ముఖ్యమైందన్నాడు ప్రభాస్..ఆదిపురుష్ గురించి చాలా భయపడ్డాను. ఆదిపురుష్ నాకు సినిమా కంటే ఎక్కువ. తాను ప్రతీసారి బాహుబలి లాంటి సినిమా పొందలేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు ప్రభాస్. బాక్సాపీస్ రికార్డుల విషయం కాదు..బడ్జెట్, ప్రజల అంగీకారం చాలా ముఖ్యం. నేను ప్రతీ ప్రాంతానికి ఏ స్థాయిలో చేరుకుంటున్నా..ఎంత మంది ప్రజలు నిరాశ చెందుతున్నారు..సంతోషంగా ఉంటున్నారు..లేదా సూపర్ ఎక్జయిట్ అవుతున్నారనేది బాక్సాపీస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతా..ఇది చాలా ముఖ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.