టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. కోవిడ్ వేవ్స్ ఎఫెక్ట్తో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇపుడు పవన్ కల్యాణ్ అభిమానుల కోసం క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఈ చిత్రం సుమారు 15 నెలలుగా పెండింగ్లో పడ్డది. సుదీర్ఘ విరామం తర్వాత చిత్రీకరణ మొదలు కానుంది. అంతేకాదు పవన్ కల్యాణ్ షూటింగ్ కోసం ఏకంగా 5 నెలలపాటు డేట్స్ ఇచ్చాడని తాజా సమాచారం. కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 6 నుంచి షురూ కానుండగా..పవన్ కల్యాణ్ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
సినిమా కథానుగుణంగా నార్తిండియా బ్యాక్ డ్రాప్లో వచ్చే ప్రసిద్ద స్మారక చిహ్నాలకు సంబంధించిన భారీ సెట్స్ ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. చారిత్రక రూపాలను తోట తరణి పర్యవేక్షణలో రూపొందించారని టాక్. హరిహర వీరమల్లులో మొగులుల కాలం నాటి దొంగ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు.
నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.