టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆచార్య సినిమా టికెట్ రేట్ల (Acharya Ticket Rates)ను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
ఒక్కో టికెట్పై మల్టీప్లెక్స్ లో రూ.50 పెంచుకునేందుకు, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఆచార్య ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక క్రేజీ అప్డేట్ మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది. ఆచార్య రన్నింగ్ టైం కొరటాల సుమారు 3 గంటలు ఉండేలా డిజైన్ చేశాడని ఇన్సైడ్ టాక్ . ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కేవలం లాహే లాహే పాటలోనే కనిపించనుందని తెలుస్తోంది.
#Acharya Nizam special hike granted for 1st week.
Rates :
Single screens – 210/212
Multiplex – 354/350 #AcharyaOnApril29th pic.twitter.com/hcehDfDaac— Praveen Kumar (@AlwaysPraveen7) April 25, 2022
రాంచరణ్ కీ రోల్ చేస్తుండగా..అతడికి జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.