టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య (Acharya). కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరోవైపు చిరంజీవి అభిమానులకు కూడా మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఆచార్య రిలీజ్ డేట్ను ఫైనల్ చేసింది చిరు-కొరటాల టీం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇదే విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సామాజిక కథాంశంతో వస్తున్న ఈ మూవీలో రాంచరణ్ కీ రోల్ పోషిస్తుండగా..కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్గా తెరకెక్కుతున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమాతోపాటు వెంకీ కుడుములతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు.